లాక్ డౌన్ లో అత్యధికంగా సంపాదించినా కోహ్లీ స్థానం ??

కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్‌ జరగకపోయినా… పలువురు స్టార్‌ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ స్టార్‌ క్రీడాకారులు ఎంత మొత్తం సంపాదించారనే లెక్కలను ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచి టాప్‌–10లో స్థానం పొందిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. గత రెండు నెలల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వాణిజ్య ప్రకటనల ద్వారా కోహ్లి మొత్తం 3,79,294 పౌండ్లు (రూ. 3 కోట్ల 64 లక్షలు) ఆర్జించాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews