ఇవి చెప్పటానికి నాకు ఏ మాత్రం సిగ్గు లేదు -ధోని

తాజాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తన క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని ధోని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే తనకు వయసు అయిపోతోందనే వ్యాఖ్యలకు సిగ్గపడబోనన్నాడు. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లేనని ఈ మిస్టర్ కూల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడబోనని వెల్లడించాడు. సచిన్ తెందూల్కర్ 17 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడని ధోని గుర్తు చేశాడు. ఈ క్రమంలో ఏకంగా పాతికేళ్లపాటు క్రికెట్ కు సచిన్ సేవలు అందించాడని వెల్లడించాడు.ఇప్పటికే చాలామంది తన కెరీర్ గురించి మాట్లాడుతున్నారని ధోని గుర్తు చేశాడు. తాను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్నానని వెల్లడించాడు. ఇప్పుడు దానిని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు.

తమ ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారని ధోని ప్రశంసించాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో యువ బౌలర్ పతిరాన సూపర్ స్పెల్ వేశాడని అభినందించాడు. అలాగే స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారని మెచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ తన వయసు కెరీర్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే ధోనికి చివరి ఐపీఎల్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ ధోని అభిమానులు మాత్రం ఇంకా క్రికెట్ ఆడాలని.. తమను రంజింపచేయాలని కోరుకుంటున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews