ధోనిలా ఉంటా ఫలితం గురించి పట్టించుకోను -భువనేశ్వర్

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్​ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్​లో కీలక మలుపు అని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో భువీ చెప్పాడు.“ఎంఎస్ ధోనీలా.. ఫలితం గురించి పట్టించుకోకుండా.. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెడుతూ శక్తిమేర రాణిస్తూ.. మ్యాచ్​పై ఏకాగ్రతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది ఓ ప్రక్రియ ప్రకారం వస్తుంది. ఐపీఎల్​లో రెండు సీజన్లు బాగా రాణించా. ఆ సమయంలో ఈ ప్రక్రియపై ఎక్కువ ఏకాగ్రత పెట్టా. తుది ఫలితం తర్వాతి విషయం అనుకున్నా. మొత్తానికి ఫలితాలన్నీ సానుకూలంగానే వచ్చాయి” అని భువనేశ్వర్ చెప్పాడు. ఐపీఎల్​లో సన్ రైజర్స్ తరఫున ఆడడం వల్ల చివరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడి మధ్య తన బౌలింగ్ ఎంతో మెరుగైందని భువీ అన్నాడు. అలాగే కీలకమైన నాకౌట్ మ్యాచ్​ల్లో కొన్ని దురదృష్ట ఘటనల కారణంగానే.. ఎంత బాగా ఆడినా ఏడేండ్లుగా టీమ్​ఇండియా ఐసీసీ మెగాటోర్నీ టైటిల్ సాధించలేకపోతున్నదని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews