లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి

ఖైదీ నెం150’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ‘సైరా’ తో పలకరించిన చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ‘ఆచార్య’ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగింది. కాగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేసే చిత్రం ఏమిటనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొని ఉంది. అయితే, చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తాడని సమాచారం. ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.ప్రస్తుతం ‘లూసిఫర్’ స్క్రిప్ట్‌లో మన నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన అయితే ఇంతవరకు వెలువడలేదు. ఇదిలా ఉండగా అన్నీ కుదిరితే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇకపోతే మలయాళ ’లూసిఫర్’ చిత్రంలో హీరో మిడిల్ ఏజ్ క్యారక్టర్‌లో కనిపిస్తాడు. అందులోనూ హీరోకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదు.. సాంగ్స్ ఉండవు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగు స్క్రిప్ట్‌లో సుజీత్ ఎలాంటి మార్పులు చేస్తున్నాడో చూడాలి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews