కేసీఆర్,ఒవైసి ఇద్దరు ఒక్కటే -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి‍ తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఒకే కుటుంబం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని తెలిపారు. 4 లక్షల14 వేల N95 మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామన్నారు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews