జబర్దస్త్ ను వదలను -అనసూయ

జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఈమె గురించి సెపరేట్‌గా పరిచయాలు అక్కర్లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. జబర్దస్త్ షోకి తన వల్ల కూడా హైప్ వచ్చిందని యాంకర్ అనసూయ చెప్పింది. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ.. టీవీ ప్రోగ్రాంలలో బబర్దస్త్ ఓ చరిత్ర సృష్టించిందని తెలిపింది. గతంలో ఆ షో నుంచి తాను వెళ్లాక, రష్మీ యాంకర్‌గా వచ్చిన తర్వాత కూడా ఆ షో నడిచిందని, ఆ షోకి తాను కూడా హైప్‌ తెచ్చానన్న విషయం లిఖించబడి ఉండే విషయమని వ్యాఖ్యానించింది.జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారని అనసూయ తెలిపింది. ‘ఇప్పుడు బాబు గారు లేరు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. మేము వద్దని వెళ్లిపోవడమే తప్ప మల్లెమాల వారు ఎన్నడూ మమ్మల్ని వద్దని చెప్పలేదు’ అని ఆమె చెప్పింది. జబర్దస్త్‌కు సంబంధించి కొన్ని షోల్లో తాను కనపడలేదని, సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లే తాను చేయలేకపోయానని తెలిపింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews