దేశ రాజధానిలో మరో దారుణం

దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీప ప్రాంతంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఆ మృగం నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో నిందితుడికి, బాధితురాలికి మధ్య పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews