స్వలాభం కోసం అమాయకులని బలి పశువులను చేయొద్దు ప్రతిపక్షాల పై హరీష్ రావు ఫైర్

ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమన్నారు. గజ్వేల్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్యేనని విమర్శించారు. స్వలాభo కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దని ప్రతి పక్షాలకు మంత్రి హితవు పలికారు.మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎక్స్రే గ్రేషియాతో పాటు ఎకరం భూమి, తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తాo. రైతు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తాం. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews