ఫస్ట్ రెస్పాండర్ 108 ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య పరికరాలు ఉంటాయని ఆయన అన్నారు. వైద్య సేవలను అన్నిప్రాంతాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను ప్రారంభించినట్లు తెలిపారు. ఎలాంటి వైద్య సాయం అవసరమైనా వెంటనే 108కు కాల్‌ చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట దవాఖాన సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews