తెలంగాణాలో బీజేపీ మాస్టర్ ప్లాన్ మూడు రోజులు తెలంగాణనలోనే ప్రధాని మోడీ

తెలంగాణలో కొద్ది రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునునారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఎల్‌. సంతోష్‌ నగరానికి బుధవారం వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews