ఏనుగును దత్తత తీసుకున్న కొణిదెల ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకుంది. సోమవారం ఆమె తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన నెహ్రూ జూపార్కును సందర్శించారు. అక్కడ ఉన్న రాణి అనే ఏనుగును ఉపాసన దత్తత తీసుకున్నట్టు ఐఎఫ్ఎస్ అధికారి క్షితిజ తెలిపారు. ఏడాది పాటు రాణి పోషణకు అయ్యే ఖర్చు రూ.5 లక్షలను ఉపాసన క్షితజకు అందించారు. ఇప్పటికే ఉపాసన ఎన్నో సమాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె సేవా దృక్పథాన్ని క్షితిజ కొనియాడారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తన సేవా కార్యక్రమాలతో పాటు తన భర్త రామ్ చరణ్ కు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews