వామ్మో కరెంట్ బిల్ 25 లక్షలు

కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు రూ.25,11,467 బిల్లు వేశారు. దీన్ని చూసి కృష్ణమూర్తి సోమవారం తార్నాకలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్‌లో లోపం ఉందని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 వేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews