కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్థికమంత్రికి లేఖ రాశారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ పరిహారం రూ.210 చెల్లించాలని కోరారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మద్దతివ్వాలని, 2019-20 సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల కాలేదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ తర్వాత నుంచి జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగిందని.. దీంతో వెనుకబడిన జిల్లాల సంఖ్య 9 నుంచి 32కి పెరిగిందని తెలిపారు. ప్రత్యేక ప్రోత్సాహాన్ని మరో ఐదేళ్లు పొడగించి, ప్రస్తుత సంవత్సరంతో పాటు 2019- 20 సంవత్సరానికి సంబంధించిన గ్రాట్‌ను త్వరగా విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2020-21 సంవత్సరానికి రూ.723 కోట్లు విడుదల చేయాలన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసు సాంప్రదాయాన్ని, పవిత్రతను కాపాడేందుకు.. గ్రాంట్‌ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని పునః పరిశీలించి గ్రాంట్‌ను త్వరగా విడుదల చేయాలని లేఖలో కోరారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews