రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు ?

ఫ్రాన్స్‌ నుండి ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు నిన్న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు. ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగిందని రాహుల్ ప్రశ్నించారు. అలాగే, భారత నేవీ 126 విమానాలు అడిగితే, కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారని ఆయన నిలదీశారు. యుద్ధ విమానాల రూ.30,000 కోట్ల కాంట్రాక్టును దేశీయ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు కాకుండా, దివాలా తీసిన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ప్రాజెక్టులో స్థానిక భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన సంస్థను డసో ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews