వింత సంఘటన పుట్టుకతోనే పాపకి దంతాలు

సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు ఈ దంతాలు కలిగిన పాప పుట్టింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews