సీఎం జగన్ కు అభినందనాలు – పూరీ జగన్నాథ్

అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డిపై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. క్లిష్ట స‌మ‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లుచేస్తున్న తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews