సంతోష్ బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌, భార్య సంతోషిని పరామర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5కోట్ల నగదు, సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కేటాయించిన ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews