ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో బిజెపి నేత షేక్‌ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బాండిపొరా జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ బాండిపొరా జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బందితో కూడిన రక్షణ ఉంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవ్వరూ లేకుండాపోయారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గార్డులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews