“థాంక్యూ” సినిమాతో వస్తున్న నాగచైతన్య

దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించనున్న కొత్త సినిమాలో అక్కినేని నాగచైతన్య నటించనున్నారు. ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తి చేతిలో ’మిస్ ఇండియా, ’రంగ్ దే‘, ’ సర్కారు వారి పాట‘తో పాటు మరో సినిమా ఉన్నాయి. అయితే కీర్తి థాంక్యూసినిమాలో నటించే విషయంలో కాసింత సందిగ్ధత నెలకొందట. వరుసు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి డేట్లను సర్దుబాటు చేయలేకపోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి నటించని పక్షంలో ప్రముఖ హీరోయిన్ సమంతను తీసుకోవాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ రూపొందించిన ’మనం‘, 24 సినిమాల్లో సమంత నటించిన విషయం తెలిసిందే. థాంక్యూసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews