తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం -హరీష్ రావు

సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కరోనాతో తెలంగాణ ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, కాంగ్రెస్ జాతీయ నాయకులు సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధిలో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ అని కొనియాడారు. కాళేశ్వరం ద్వారా సంగారెడ్డి, మహబూబ్‌సాగర్ లో చెరువు నింపుతామని, ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతోందని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews