ధోని ఒక దిగ్గజం -రోహిత్

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బరిలోకి దిగాలనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ సవాల్‌ లాంటిది. ధోనీ గురించి ఒక్క మాటలో చెప్పలాంటే అతడో దిగ్గజం. స్టీవ్‌ స్మిత్‌, జేసన్‌ రాయ్‌ బ్యాటింగ్‌ తీరును బాగా ఇష్టపడుతా’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్‌ కారణంగా ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై సందిగ్ధత కొనసాగుతుండగా.. ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews