రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం

టీం ఇండియా క్రికెట్ ఓపెనర్ రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం దక్కనుంది.ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డుకు బీసీసీఐ రోహిత్ శర్మ పేరును నామినేట్ చేసింది. అలాగే అర్జున అవార్డులకు ఓపెనర్ శిఖర్ ధావన్ , బౌలర్ ఇషాంత్ శర్మ పేర్లను కేంద్ర మంత్రిత్వ శాఖకు నామినేట్ చేసింది.

మహిళల విభాగం నుండి అర్జున అవార్డుకు దీప్తి శర్మ పేరును పంపింది. భారత మహిళా జట్టు అల్ రౌండర్ గా దీప్తి శర్మ ఎన్నో విజయాలను భారత్ కు అందించింది

ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ లో తన డాషింగ్ బ్యాంటింగ్ తో ఐదు శతకాలు చేసాడు .అంతేకాకుండా వన్డేలో మూడు ద్వి శతకాలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews