అయోధ్య భూమి పూజ మోడీ పై కుష్బూ విమర్శలు

నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ సదానందగౌడ ఈ ఉదయం ట్వీట్ చేస్తూ… తన ప్రియతమ రాజు మోదీని తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ట్వీట్ ను సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాముడి కంటే మోదీ ఎక్కువయ్యాడని… కలికాలం అంటే ఇదేనని విమర్శించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews