ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం -మోడీ

అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే రామమందిరం కోసం ఎందరో పోరాటం చేశారు. బలిదానాలు చేశారు. వారందరి త్యాగాలతోనే ఈ రోజు రామమందిరం నిర్మాణం జరుగుతుందన్నారు మోదీ.రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. ప్రసంగం కంటే ముందు రామాలయం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జైశ్రీరామ్‌ నినాదాలతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం అని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు భారతదేశమంతా రామమయం అయింది. కోటాను కోట్ల మంది హిందువులకు ఈ రామాలయం నిర్మాణం ఎంతో ముఖ్యమైనది. ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు.. కానీ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు వినిపిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు. రామమందిరం ఇకపై భవ్య మందిరంగా రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందని చెప్పారు. రామమందిరం నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితమిది. రాముడు అందరి మనసులో నిండి ఉన్నారని మోదీ పేర్కొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews