అయోధ్య రామమందిరం భూమి పూజకు అద్వానికి ఆహ్వానం అందలేదా ??

అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5భూమిపూజ జగనున్న సంగతి విదితమే. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో వీరిద్దరి వయసు దృష్టిలో ఉంచుకుని ఆహ్వానించదని చెబుతున్నప్పటికీ స్పష్టత రావలసి ఉంది. మరోపక్క, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉమాభారతి, కల్యాణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి తాము ఏమాత్రం చింతించమని చెప్పారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews